- రెండో రోజు రివ్యూ నిర్వహించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీమ్
- నేడు ఎడమ కాల్వ జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించనున్న బృందం
హాలియా, వెలుగు : మూడు రోజుల పర్యటనలో భాగంగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం బుధవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన పవర్హౌజ్, రైట్కెనాల్పవర్హౌజ్కేంద్రాన్ని సందర్శించింది. జెన్కో చీఫ్ ఇంజినీర్ మంగేశ్కుమార్ ఆధ్వర్యంలో జెన్కో మీటింగ్హాల్లో బృందం చైర్మన్ ప్రస్తుత సీడబ్ల్యూ సీ డైరెక్టర్ రమేశ్కుమార్ రివ్యూ నిర్వహించారు.
సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఎంత మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది? ఎంత పరిమాణంలో నీటిని వినియోగిస్తున్నారు? ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో రివర్స్ బుల్ టర్బన్ల పనితీరు , రివర్స్ బుల్ టర్బన్లు పనిచేస్తున్నప్పుడు జలాశయంలోకి నీటిని పంపే ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అనే అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం , భద్రత , నీటి వినియోగం , విద్యుత్ ఉత్పత్తి లాంటి పలు అంశాలపై పూర్తి నివేదికను తయారు చేస్తున్నారు. తర్వాత నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ను, దాని పరిధిలోని కుడి కాలువ జల విద్యుత్ కేంద్రాన్ని టీమ్మెంబర్స్పరిశీలించారు. నాగార్జునకొండ పైకి వెళ్లి పురావస్తు ఐలాండ్ మ్యూజియాన్ని విజిట్చేశారు. గురువారం సాగర్ ఎడమ కాల్వ జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఆశిష్ కుమార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్ మహేంద్రసింగ్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చీఫ్ ఇంజినీర్ కుమార్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎస్ ఈ మురళీకృష్ణ , నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ జిషన్, నేషనల్ డ్యామ్సేఫ్టీ అథారిటీ టెక్నికల్ఎక్స్పర్ట్రాకేశ్ ,స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సీఈ ప్రమీల, ఎస్ఈ శ్రీనివాసులు, ఈఈ విజయలక్ష్మి , డీఈ సతీశ్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్, డ్యాం ఎస్ఈ నాగేశ్వరరావు, ఈఈ మల్లికార్జునరావు, ఆంధ్ర సీఈ మురళీధర్ రెడ్డి, కృష్ణా రివర్ బోర్డు ఎస్ఈ వరలక్ష్మి దేవి , ఈఈ శ్రీహరి, సాగర్ డీఈలు శ్రీనివాస్ రావు, ఏఈలు కృష్ణయ్య, సత్యనారాయణ ఉన్నారు.